News January 19, 2025
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే

ఇటీవల జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్గా నియమించబడిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగారెడ్డిని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లె గంగారెడ్డి అన్నారు.
Similar News
News February 23, 2026
హార్వర్డ్ నుంచి CM రేవంత్కు ఆహ్వానం

TG: CM రేవంత్ రెడ్డికి USలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. మార్చి 27న అక్కడ జరిగే ‘AI పాలసీ సింపోజియం’లో ప్రసంగించాలని నిర్వాహకులు కోరారు. ఈ సదస్సుకు భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక CM రేవంత్ కావడం విశేషం. AI ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు, ఉపాధిపై దాని ప్రభావం వంటి అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. TG ప్రభుత్వం చేపట్టిన AI ప్రాజెక్టులను ఈ వేదికపై వివరించనున్నారు.
News February 23, 2026
పవర్ప్లేలో వికెట్లు పారేసుకున్నాం.. ఓటమిపై సూర్య కామెంట్స్!

SAతో భారీ ఓటమికి బౌలర్లు కారణం కాదని కెప్టెన్ సూర్య వారిని వెనకేసుకొచ్చారు. 188 రన్స్ ఛేజింగ్లో పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం టీమ్ఇండియా కొంపముంచిందన్నారు. బౌలింగ్లో బుమ్రా, అర్ష్దీప్ రాణించినా.. మిగతా వారు ధారాళంగా రన్స్ ఇచ్చారు. అయినప్పటికీ బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని సూర్య తేల్చేశారు. జింబాబ్వేతో జరిగే తదుపరి మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.
News February 23, 2026
ఎటపాకలో నాలుగు కాళ్ల కోడిపిల్ల జననం

ఎటపాక మండలం సీతాపురంలో వింత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చుక్కా కుమారి పెంచుతున్న కోడి పెట్టిన గుడ్లలో ఒక దాంట్లోంచి నాలుగు కాళ్లతో పుట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీతాపురానికి చేరుకుని నాలుగు కాళ్ల కోడిపిల్లను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం కోడిపిల్ల ఆరోగ్యంగా ఉందని యజమాని తెలిపారు.


