News January 31, 2025

జాతీయ భాష అభివృద్ధికి చర్యలు తీసుకుంటా: సీఎం

image

ఆంధ్రప్రదేశ్‌లో హిందీ ప్రచారసభలో పూర్తి సహాయ సహకారాలను అందజేయడంతో పాటు హిందీ బోధన పోస్టులు, హిందీ భాషాభివృద్ధికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో హిందీ ప్రచారసభ, హిందీ ప్రచార సభ డైరీలను సీఎం ఆవిష్కరించారు. హిందీ ప్రచార సభ జనరల్ సెక్రటరీ గైబువల్లి ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. 

Similar News

News July 6, 2025

HYD: విద్యుత్ సమస్యలపై ప్రతి బుధవారం ముఖాముఖి

image

గ్రేటర్ HYD నగరం పరిధిలో ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని ఎండి ముషారఫ్ అలీ ఆదేశించారు. విద్యుత్ శాఖ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సైతం ఉపయోగించనున్నట్లు తెలిపారు. విద్యుత్ డిమాండ్, హెచ్చుతగ్గుల గుర్తింపు, అంతరాయాల నియంత్రణ కోసం ఈ సేవలు సైతం ప్రారంభం కానున్నాయి. స్థానికంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News July 6, 2025

బిహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు: రాహుల్ గాంధీ

image

BJP, CM నితీశ్ కలిసి బిహార్‌ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్‌లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్‌ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.

News July 6, 2025

సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

image

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.