News March 4, 2025
జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

మార్చి8న జాతీయ లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు ఇదొక సువర్ణావకాశం. పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసుల్లో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కేసులు నమోదు చేసుకొని పంతాలకు పోకుండా రాజీపడే కేసుల్లో కక్షిదారులు రాజీపడి అన్నదమ్ముల్లా మెలగాలన్నారు. రాజీమార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.
Similar News
News March 4, 2025
ఇండియాలో మాత్రం బికినీ వేసుకోను: సోనాక్షి సిన్హా

ఇండియాలో తాను ఎట్టి పరిస్థితుల్లో బికినీ వేసుకోనని హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. ఇక్కడ ఎవరు ఏ వైపు నుంచి ఫొటో తీస్తారో తెలియదని చెప్పారు. అందుకే వేరే దేశం వెళ్లినప్పుడు బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని పేర్కొన్నారు. దీనిపై కొందరు ఆమెకు సపోర్ట్గా నిలవగా ఆ ఫొటోలు నెట్టింట ఎందుకు షేర్ చేస్తున్నావు? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
News March 4, 2025
జైపూర్లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ KGBVలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.
News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.