News July 3, 2024

జాతీయ స్థాయికి ఎంపికైన ఒంగోలు విద్యార్థినులు

image

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఒంగోలులోని ఓ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల పర్యవేక్షణ అధికారి వసుంధర దేవి పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న అభిలాష, నాలుగో తరగతి చదువుతున్న గీతాంజలి జూన్ 20న విజయవాడలో జరిగిన అండర్-13 విభాగంలో రాణించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News July 5, 2024

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్

image

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణకు ఆదేశించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.

News July 5, 2024

చీమకుర్తి : నూడుల్స్ తింటూ వ్యక్తి మృతి

image

చీమకుర్తిలోని ఓ రెస్టారెంటులో గురువారం రాత్రి నాగశేషులు అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి 9 గంటల సమయంలో నాగశేషులు పట్టణంలోని ఓ రెస్టారెంట్‌కి వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేసి కొంత వరకు తిన్నాడు. తింటుండగానే కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఆత్మకూరుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట

image

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.