News September 9, 2025

జాఫర్‌గఢ్: పెట్టుబడి దారి సమాజానికి ప్రత్యామ్నాయం సోషలిజమే: రాపర్తి రాజు

image

పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లిలో సీపీఎం మండల రాజకీయ శిక్షణా తరగతులను ఈరోజు ప్రారంభించారు. రాపర్తి రాజు పాల్గొని సీపీఎం జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ సమాజానికి కాలం చెల్లిందని, భవిష్యత్ సోషలిజం, ఎర్రజెండానే అని అన్నారు.

Similar News

News September 9, 2025

ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే..

image

ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర MLC ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.

News September 9, 2025

HYD: కీర్తి పురస్కారాలు-2024.. 48 మంది ఎంపిక

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా నిర్వహించే కీర్తి పురస్కారాలకు 2024 సంవత్సరానికి గాను 48 మందిని ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సోమవారం Way2Newsతో తెలిపారు. VC ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసిందని, ఈనెల 23, 24న నాంపల్లిలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఎంపికైన వారిని సత్కరిస్తామన్నారు.

News September 9, 2025

నేటి నుంచి ఆసియా కప్ సమరం

image

యూఏఈ వేదికగా ఇవాళ్టి నుంచి ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) జరగనుంది. తొలి మ్యాచులో నేడు గ్రూప్-Bలోని అఫ్గానిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్షం ప్రసారం చూడవచ్చు. రేపు గ్రూప్-Aలోని భారత్, యూఏఈ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.