News October 24, 2025

జాబ్ మేళా 2 రోజులు కొనసాగుతోంది: మంత్రి ఉత్తమ్

image

హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా మరుసటి రోజు 26తేదీ కూడా కొనసాగించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగుల నమోదు 30 వేల వరకు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. మరుసటి రోజు కూడా భోజన, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News October 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News October 25, 2025

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి..!

image

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, అధికార వర్గాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

News October 25, 2025

కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.