News July 29, 2024
జిల్లాలోని పర్యాటక కేంద్రాల వివరాలు అందజేయాలి: జేసీ

జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని వాటి వివరాలను సంపూర్ణంగా తనకు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఆదివారం జిల్లా పర్యాటక శాఖ ఏడీ, నడిమింటి నారాయణరావు తన సిబ్బందితో కలిసి జేసీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన జిల్లాలో పర్యాటక కేంద్రాలతోపాటు పలు చారిత్రక ఆలయాలు ఉన్నాయని వాటి వివరాలు తెలపాలన్నారు.
Similar News
News February 16, 2026
ఎల్.ఎన్.పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోటి వచ్చిన ఆనందం

ఎల్.ఎన్.పేట(M) కేంద్రంలో పెద్దకోట గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మొక్కజొన్న పొత్తులను ప్రయాణికులకు అమ్ముతున్న దృశ్యం సోమవారం కనిపించింది. కాలానుగుణంగా ఉన్న పంటలను, ఇతర పదార్థాలను ఈ గ్రామం వద్ద బస్సులు ఆగినప్పుడు అమ్మి జీవనోపాధి సాగిస్తారు. బస్సు నడిస్తే పరుగుపెడుతూ..జొన్నపొత్తుల ద్వారా వచ్చే రూ.50లకు రోజంతా కష్టపడి జేబు నిండితే ఆనందంగా ఇంటి బాట పడతారు.
News February 16, 2026
ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.
News February 16, 2026
ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18-40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380,
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000-24,470 వేతనం ఉంటుంది.


