News March 28, 2025

జిల్లాలో ఉగాది పురస్కారాలకు 11 మంది ఎంపిక

image

ఏలూరు జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు విశిష్టమైన సేవలు అందించి ఉగాది పురస్కారాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో 11 మంది ఈ ఉగాది పురస్కారానికి ఎంపికైనట్లు తెలిపారు. అవార్డులు, పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.

Similar News

News October 24, 2025

MNCL: 73 మద్యం షాపులకు 1,712 దరఖాస్తులు

image

మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 73 మద్యం షాపులకు మొత్తం 1,712 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సీఐ గురవయ్య తెలిపారు. చివరి రోజైన నిన్న 88 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు 27న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌‌లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు.

News October 24, 2025

జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టు తదుపరి <<18083662>>సీజేఐ<<>> రేసులో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 1962లో హరియాణాలోని హిసార్‌లో జన్మించారు. 1984లో లా డిగ్రీ అందుకున్న ఆయన 2000లో హరియాణా AGగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్‌‌ప్రదేశ్ HC ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. ఒకవేళ ఆయన CJI నియమితులైతే నవంబర్ 24న బాధ్యతలు చేపట్టి 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.

News October 24, 2025

ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

image

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.