News January 31, 2026

జిల్లాలో ఉద్యాన సాగు విస్తరణకు ప్రణాళిక: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి కంటే ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Similar News

News February 11, 2026

ఆర్టీసీలో 115 మంది ఉద్యోగులకు పదోన్నతులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) విజయవాడ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు, విజయనగరం, పార్వతీపురం మన్యం రీజియన్లలో వివిధ వర్గాలకు చెందిన 115 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ప్రజా రవాణా అధికారిణి వరలక్ష్మి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పదోన్నతులు సంస్థలో ఉద్యోగుల ఎదుగుదలకు దోహదపడతాయని ఆమె తెలిపారు.

News February 11, 2026

శివ‌రాత్రికి ప‌క్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శివాల‌యాల్లో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శివ‌రాత్రి పండుగ ఏర్పాట్ల‌తోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయి అధికారులతో వీసీలో సుదీర్ఘంగా సమీక్షించారు. ద‌ర్శ‌నాల‌కు ఎటువంటి ఆటంకాలు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సూచించారు.

News February 11, 2026

బొబ్బిలి: స్కూల్ బస్సు బోల్తా

image

బొబ్బిలి మండలం అలజంగి చెట్టు వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. కారాడ సమీపంలో ఉన్న సన్ రైజ్ ఆశ్రమానికి చెందిన విద్యార్థులు బొబ్బిలి పట్టణంలోని పలు విద్యాసంస్థలలో చదువుతున్నారు. పాఠశాలల నుంచి బుధవారం సాయంత్రం ఆశ్రమానికి వెళ్తుండగా అలజంగి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో 23 మంది విద్యార్థులకు గాయలయ్యాయి. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.