News February 2, 2026

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

image

కాకినాడ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ జెడీ విజయకుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పంటలకు అవసరమైన 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సోమవారం కూడా ఎం.ఎఫ్.ఎల్ (MFL) ద్వారా మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని పేర్కొన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 8, 2026

భారత్‌-పాక్ మ్యాచ్.. కాసేపట్లో నిర్ణయం!

image

టీ20 వరల్డ్ కప్‌ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు. అయితే PCB మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈనెల 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ICC అఫీషియల్స్-PCB సభ్యులు భేటీకానున్నారు. ఈ సమావేశం ముగిశాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

News February 8, 2026

NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.

News February 8, 2026

షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ ఫుడ్స్ ఇవే..

image

బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపే ఫుడ్స్‌కు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి రేటింగ్ ఇచ్చారు. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే గుడ్లు, పచ్చని కూరగాయలు (10/10) మేటి ఆహారాలుగా నిలిచాయి. నట్స్ (9/10), బెర్రీలు (8/10) షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. అయితే వైట్ రైస్ (3/10), ఫ్రూట్ జ్యూస్ (2/10) రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయని, షుగరీ డ్రింక్స్ (0/10) చాలా డేంజర్ అని హెచ్చరించారు.