News December 11, 2025

జిల్లాలో ఓటేసేందుకు ముందుకొస్తున్న యువత

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి కాస్త బద్దకిస్తున్నట్లు కన్పిస్తోంది. యువత మాత్రం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటేసేందుకు ఓటర్లు వస్తుండడంతో పల్లెల్లో సందడి నెలకొంది.

Similar News

News December 12, 2025

కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

image

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్‌లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 12, 2025

కరీంనగర్‌ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచింది.
చొప్పదండి: 16 GPలకు కాంగ్రెస్ 8 , BRS 6 , ఇతరులు 2
గంగాధర:33 GPలకు కాంగ్రెస్ 9 ,BRS 3 ,BJP 9, ఇతరులు 9
కరీంనగర్ రూరల్: 14 GPలకు కాంగ్రెస్ 6 , BRS 1 , BJP 4 , ఇతరులు 2
కొత్తపల్లి: 6 GPలకు కాంగ్రెస్ 1 , BRS 2 , BJP 1 , ఇతరులు 2
రామడుగు: 23 GPలకు కాంగ్రెస్ 9 , BRS 4 , BJP 5 , ఇతరులు 4

News December 12, 2025

కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.