News August 3, 2024
జిల్లాలో చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఉత్పత్తి అయ్యే చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో చేనేత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైలవరం మండలం టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.
Similar News
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


