News October 1, 2024

జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Similar News

News February 4, 2026

మిర్యాలగూడకు మొదటిసారి CM.!

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మిర్యాలగూడ రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ పట్టణంలో సీఎం పర్యటిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మొదటిసారి వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనతో పట్టణానికి ఎలాంటి వరాలజల్లు కురిపించనున్నారని ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా ఏర్పాటు విషయం గురించి మాట్లాడతారా.. అనే చర్చ కొనసాగుతోంది.

News February 4, 2026

మిర్యాలగూడలో నేడు సీఎం రేవంత్ సభ

image

మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త హామీలకు అవకాశం లేకపోవడంతో, గత రెండేళ్ల పాలనపైనే ప్రధానంగా ప్రసంగించనున్నారు. మరోవైపు, నిధుల కేటాయింపులో వివక్ష, పెండింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

News February 3, 2026

NLG: నా ప్రాణం.. చివరి శ్వాస వరకు మీకోసమే: మంత్రి కోమటిరెడ్డి

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున హోరెత్తించారు. నల్లగొండ తన ఇల్లు, ప్రాణం అని పేర్కొంటూ ప్రజలతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను అభ్యర్థించారు.