News August 26, 2024
జిల్లాలో పీఎం మాన్-ధన్ యోజనకు ఆదరణ కరువు

కరీంనగర్: ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజనకు కరీంనగర్ జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అన్నదాతలకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది రైతులు అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు వెయ్యి మంది మాత్రమే ఇందులో చేరారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించ కపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Similar News
News February 9, 2026
దుర్శేడు మండల పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ (R) మండలం దుర్శేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, గోపాలపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో ఆమె గణితం, ఆంగ్ల పాఠాలు చదివించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీకి సంబంధించిన మోడల్ టెస్ట్ పేపర్లలోని పలు ప్రశ్నలను అడుగుతూ విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు తరచూ మాక్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
News February 9, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలు.. 163 సెక్షన్ అమలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 విధించినట్లు కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 9, 2026
KNR: ఎన్నికల నిఘా ‘ముమ్మరం’.. సరిహద్దుల్లో తనిఖీలు!

ప్రలోభాలను అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీని కఠినతరం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 28 వరకు జిల్లాలోపోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.


