News September 6, 2025

జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం తెలిపారు. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 21 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.

Similar News

News September 7, 2025

ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

image

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 7, 2025

రాజమండ్రి: కేసుల దర్యాప్తుకు కొత్త జాగిలాలు

image

కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త జాగిలాలు వచ్చినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. ఈ నూతన జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘రాడో’ అనే జాగిలం శిక్షణ కాలంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించిందని ప్రశంసించారు. డాగ్ హ్యాండ్లర్ల కృషిని ఆయన అభినందించారు.

News September 6, 2025

అల్లు అరవింద్‌ను పరామర్శించిన జక్కంపూడి రాజా

image

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా శనివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. ఇటీవల అరవింద్ తల్లి కనకరత్నం మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జక్కంపూడి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.