News June 26, 2024

జిల్లాలో పెరగనున్న సన్న రకం వరి

image

ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సన్నరకం వరి సాగు గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే రైతులు సన్నరకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నార్లు పోసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నిండింది. అంతేకాక మిల్లర్లు, వ్యాపారులు సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకే ఆసక్తి కనబరుస్తుండడంతో రైతులు ఆ పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు.

Similar News

News September 29, 2024

మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు: కలెక్టర్

image

యువత ప్రయాణంలో నేటి మెగా జాబ్ మేళా తొలి అడుగు మాత్రమేనని, ఈ రోజు వచ్చే ఉద్యోగం చేస్తూ జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం SR&BGNR డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దని కలెక్టర్ సూచించారు.

News September 28, 2024

కొత్తగూడెం: ఆస్తమాతో ఇద్దరు చిన్నారుల మృతి

image

పినపాక మండలం మద్దులగూడెంలో శనివారం సాయంత్రం ఇద్దరు పసి పాపలు ఆస్తమాతో మృతి చెందారు. చిన్నారుల తల్లిదండ్రుల వివరాలిలా.. మద్దులగూడెం ఎస్టీ కాలనికి చెందిన ఇరుప మహేష్, మంజులకు రెండు నెలల బాబు.. పండా ప్రసాద్, మరియమ్మల రెండు నెలల పాప ఆస్తమాతో మృతి చెందారు. భద్రాచలం ఆసుపత్రిలో చూపించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 28, 2024

ఖమ్మం ఖిల్లాకు కలెక్టర్.. రోప్ వే స్థల పరీశీలన

image

ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రోప్‌వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని పరిశీలించారు.