News December 27, 2025
జిల్లాలో మహిళలపై తగ్గిన నేరాలు: ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి జిల్లాలో మహిళల భద్రతకు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల వారిపై జరుగుతున్న నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మహిళలపై జరిగిన నేరాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 420 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 384కి తగ్గిందని వివరించారు. అంటే మొత్తం మీద మహిళలపై నేరాలు 8.57 శాతం తగ్గాయని వెల్లడించారు.
Similar News
News December 28, 2025
వాళ్లకు దేశం కన్నా మతమే ఎక్కువ: అస్సాం CM

బంగ్లాదేశీయులకు దేశం కన్నా మతమే ఎక్కువని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘ఇప్పుడు బంగ్లాదేశ్లో <<18624742>>దీపూ చంద్రదాస్<<>> పరిస్థితి చూస్తున్నాం. 20 ఏళ్ల తర్వాత అస్సాంలో ఇలానే జరిగే ప్రమాదం ఉంది. 2027 నాటికి అస్సాంలో బంగ్లా సంతతికి చెందిన మియా ముస్లింలు 40% ఉంటారు’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ‘నాగరికత పోరాటం’గా హిమంత అభివర్ణించారు.
News December 28, 2025
పార్లమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న మెదక్ విద్యార్ధి

పార్లమెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యార్ధి పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ(NCERT) ఢిల్లీచే ఎంపిక చేసి పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాపన్నపేట మండలం లింగాయపల్లి చీకోడ్ విద్యార్థి ఏ.శివ చైతన్య, ఉపాధ్యాయుడు ఆర్.కిషన్ ప్రసాద్ను ఆహ్వానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.. విద్యార్థి, ఉపాధ్యాయుడిని అభినందించారు.
News December 28, 2025
ధోనీతో ఆడటం నా అదృష్టం: డుప్లెసిస్

CSKలో MS ధోనీ, స్టీఫెన్ ఫ్లేమింగ్ వంటి గొప్ప ప్లేయర్ల ఆధ్వర్యంలో ఆడటం తన అదృష్టమని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నారు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. CSKలో పదేళ్లు, JSKలో మూడేళ్లు ఆడానని, ఇదో గొప్ప ఫ్రాంచైజీ అని అన్నారు. ఇటీవల IPLకు డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా T20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నారు.


