News October 23, 2025
జిల్లాలో మూడు చోట్ల వ్యాసరచన, వక్తృత్వ పోటీలు: DEO

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవం పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు చోట్ల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. 8 నుంచి టెన్త్ విద్యార్థులు దేశభక్తి, సామాజిక బాధ్యత, చట్టాలు అనే అంశాలపై వ్యాసరచన అద్భుత పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రాయచోటి డైట్ కళాశాల, మదనపల్లి జడ్పీ హై స్కూల్, రాజంపేట గర్ల్స్ హైస్కూల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News October 23, 2025
BREAKING: HYD: విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ పరిధి యమ్నంపేట్లోని ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిచేతన్ రెడ్డి(17) పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. డెడ్బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా?, ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగగా సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వాటిని నిషేధించడం లేక తక్కువ సామర్థ్యం ఉన్నవాటిని అనుమతించడంపై పరిశీలన చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. అటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం ఉంది.
News October 23, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కాకినాడ కలెక్టర్ సూచనలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు మధ్యాహ్నం వాయుగుండంగా మారుతుందని కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పరిస్థితులను సమీక్షించేందుకు కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, అవి 27వ తేదీ వరకు పనిచేస్తాయని చెప్పారు. సహాయం కోసం 0884-2356801 నంబర్ను సంప్రదించవచ్చన్నారు.