News December 16, 2025

జిల్లాలో మూడో విడత పోరుకు సిద్ధం

image

సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏడు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలకు గాను, ఇప్పటికే 22 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 సర్పంచ్ స్థానాలకు, 1,061 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1,176 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 4,750 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.

Similar News

News December 19, 2025

విజయవాడ: మాతృత్వాన్ని మరచిన సరోజ..!

image

విజయవాడ కబేళా సెంటర్‌కు చెందిన బలగం సరోజ అలియాస్ సరోజిని పిల్లల విక్రయ ముఠాకు ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. పిల్లల అక్రమ విక్రయాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంది. తల్లి ఒడిలో ఉండాల్సిన అభం శుభం తెలియని చిన్నారులను వేలం వేసి విక్రయిస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. మహిళగా మాతృత్వాన్ని విస్మరించి, నెలలు నిండని పిల్లలను అక్రమంగా విక్రయిస్తూ మరోసారి పోలీసుల చేతికి చిక్కింది.

News December 19, 2025

పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT

News December 19, 2025

అలాంటి ఒప్పందమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య

image

పవర్ షేరింగ్‌పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే CMగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు. ‘నేను ఇప్పుడు సీఎంను. హైకమాండ్ డిసైడ్ చేసే వరకు కొనసాగుతా. అధిష్ఠానం నాకే ఫేవర్‌గా ఉంది. 2.5 ఏళ్ల ఒప్పందమేదీ జరగలేదు’ అని తెలిపారు. CM పదవిపై DK శివకుమార్, సిద్దరామయ్య మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ <<18446337>>బ్రేక్‌ఫాస్ట్<<>> మీటింగ్స్ నిర్వహించారు.