News October 24, 2025
జిల్లాలో రాబోయే 5 రోజులు వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వాతావరణ పరిశీలన కేంద్రం టెక్నికల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ తెలిపారు. రైతులు కోసి ఎండబెట్టిన మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలను టార్ఫాలిన్ కవర్లతో కప్పడం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News October 25, 2025
MBNR: బీ.ఫార్మసీ.. స్పాట్ అడ్మిషన్స్

పాలమూరు వర్శిటీలోని బీ.ఫార్మసీ కోర్సులో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమేష్ బాబు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 26లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని, ఈనెల 28న పబ్లికేషన్ ఫారం ఫార్మసీ కళాశాల కార్యాలయంలో ఇచ్చి కన్ఫామ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www.palamuruunivetsity.ac.in వెబ్ సైట్ను సందర్శించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 25, 2025
బస్సు దగ్ధం.. రావులపాలెం వాసి మృతి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు దగ్ధం ఘటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు చిక్కుకున్నారు. రావులపాలెంకు చెందిన క్రేను ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి రెండు రోజులు క్రితం పనుల కోసం HYD వెళ్లాడు. వేరే పని ఉండడంతో బెంగళూరు వెళ్లడానికి బస్సు ఎక్కి, ప్రమాదంలో మరణించాడు. కాగా అనపర్తికి చెందిన రామారెడ్డి, కాకినాడకు చెందిన సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
News October 25, 2025
ఖమ్మం: DCC ఎవరికి దక్కేనో..!

ఖమ్మం, కొత్తగూడెం డీసీసీలు నేడు ఖరారు కానున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. ఖమ్మం డీసీసీ పీఠానికి 51 మంది అప్లై చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 50కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్, జాన్సన్ జిల్లా అగ్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుని అధిష్ఠానానికి నివేదించారు. మరి పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.


