News November 13, 2025
జిల్లాలో వారిపై నిఘా ఉంచాలి: అనకాపల్లి ఎస్పీ

జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ తుహీన్ సిన్హా పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ వారెంట్లుపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సమన్వయం కొనసాగిస్తూ కేసులలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 13, 2025
కామారెడ్డి: బీసీ ఆక్రోశ సభకు మద్దతు ప్రకటించిన ఎలక్ట్రిసిటీ యూనియన్

కామారెడ్డిలో శనివారం జరగనున్న BC ఆక్రోశ సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం వారు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆహ్వాన కమిటీ ఛైర్మన్ మర్కంటి భూమన్న కో ఛైర్మన్లు క్యాతం సిద్ధ రాములు, బాలార్జున్ గౌడ్ సమక్షంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 42% BC రిజర్వేషన్ల సాధన కోసం నిరంతరం పోరాడుతామన్నారు.
News November 13, 2025
ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.
News November 13, 2025
సోలార్ విద్యుత్ విస్తరణ వేగవంతం చేయాలి: రెడ్కో ఛైర్మన్

భద్రాద్రి జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలని టీజీ రెడ్కో ఛైర్మన్ శరత్ అన్నారు. సౌరశక్తి వినియోగంపై కలెక్టర్ జితేష్ వి పాటిల్తో ఆయన సమీక్ష జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యవసాయ పంపుల వద్ద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


