News March 20, 2024
జిల్లాలో సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయండి: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710945034107-normal-WIFI.webp)
జిల్లాలో ఎన్నికల వేళ ఎక్కడైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా, ఏదైనా హింస, అల్లర్లు, గొడవలకు పాల్పడుతున్నా వెంటనే తమకు ఈ నంబర్ ద్వారా 9440796800 సమాచారం పంపాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News July 5, 2024
కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన పయ్యావుల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720167087144-normal-WIFI.webp)
ఢిల్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపు గురించి చర్చించారు.
News July 5, 2024
బ్రహ్మోత్సవాలకు రండి.. మంత్రి సవితకు శ్రావణి ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164334654-normal-WIFI.webp)
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. పెనుకొండలో కలిసిన ఆమె గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.
News July 5, 2024
అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720146784016-normal-WIFI.webp)
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.