News January 14, 2026

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: మంత్రి పార్థసారధి

image

జిల్లాలో రైతుల అవసరాలకు మించి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. మంగళవారం నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం‌ను సందర్శించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లాకు 10,073 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12 వేల టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు అధిక మొత్తంలో ఎరువులు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.

Similar News

News February 19, 2026

నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

News February 19, 2026

తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

image

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.

News February 19, 2026

KMR: సహేరి అంటే ఏమిటి? ఇఫ్తార్‌ విశిష్టత ఇదే..

image

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, అంటే ఫజర్ అజాన్ కంటే ముందే తీసుకునే ఆహారాన్ని ‘సహేరి’ అంటారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉండేందుకు శరీరానికి అవసరమైన శక్తిని ఈ ఆహారం అందిస్తుంది. రోజంతా నీరు కూడా ముట్టకుండా కఠిన దీక్షను పాటించిన అనంతరం, సూర్యాస్తమయం వేళ దీక్షను విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సాధారణంగా ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు.