News February 26, 2026

జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం- కలెక్టర్

image

వయోజనులకు అక్షరాభ్యాసం జరిగితేనే రాష్ట్రం, జిల్లా అక్షరాస్యతలో ముందుకు వెళ్తుందని డా.కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడమే లక్ష్యమన్నారు. వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పాలన్నారు. మార్చి 15న మొదటి దశలో అక్షరాభ్యాసం పొందిన వారికి చివరి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు.

Similar News

News February 27, 2026

సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో మార్చి 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

News February 27, 2026

రెంటచింతలలో వివాహిత ఆత్మహత్య

image

రెంటచింతల మండలం మంచికల్లులో కుటుంబ కలహాల నేపథ్యంలో బంకూరి మల్లేశ్వరి (35) అనే వివాహిత గురువారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి, ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

News February 27, 2026

రేపు, ఎల్లుండి ఏపీలో సీజేఐ పర్యటన

image

AP: CJI జస్టిస్ సూర్యకాంత్ 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుపతిలో 16 కోర్టుల భవన నిర్మాణానికి ఎల్లుండి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరావతికి చేరుకొని AP జుడీషియల్ అకాడమీ, హైకోర్టు గెస్ట్‌హౌస్‌లకు భూమిపూజ చేస్తారు. హైకోర్టు వద్ద నిర్మించిన న్యాయమూర్తుల నివాసాలను ప్రారంభిస్తారు. గవర్నర్ జస్టిస్ నజీర్, CM CBNతో కలిసి సభలో పాల్గొంటారు.