News April 29, 2024
జిల్లాలో TOSS INSTER & SSC పబ్లిక్ పరీక్షలు ప్రశాంతం

వరంగల్ జిల్లాలో TOSS INSTER & SSC పబ్లిక్ పరీక్షలలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించా మని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి అన్నారు. ఈ రోజు (5) పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. ఓపెన్ టెన్త్ ఎస్ఎస్సి లో ఉదయం 86% , మధ్యాహ్నం 84% మంది విద్యార్థులు హాజరైనారన్నారు. ఇంటర్లో ఉదయం 91% మధ్యాహ్నం 88% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Similar News
News April 22, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839 చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.
News April 22, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.
News April 21, 2025
WGL: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్కు మే 11 చివరి తేదీ. వెబ్సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281