News January 14, 2026

జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

image

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.

Similar News

News February 14, 2026

రామాయంపేటలో అధికార పార్టీకే పట్టం

image

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి అధికార పార్టీకి జై కొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తొలి ఎన్నికల్లో 8 స్థానాలను ఆ పార్టీకి అందించిన ఓటర్లు, నేడు జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే రీతిన కాంగ్రెస్ పార్టీకి 8 కౌన్సిలర్ స్థానాలను కట్టబెట్టారు. అధికార పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News February 14, 2026

మెదక్: మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకం

image

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ రాహుల్ రాజ్ నలుగురు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మెదక్ మున్సిపాలిటీకి ఎల్లయ్య(ZP CEO), రామాయంపేటకు జయచంద్రారెడ్డి(RDO తూప్రాన్), నర్సాపూర్‌కు రమాదేవి(RDO మెదక్), తూప్రాన్‌కు మహిపాల్‌(RDO నర్సాపూర్) అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

News February 14, 2026

రామాయంపేట: డైరెక్టర్‌గా ఉంటూ.. కౌన్సిలర్‌గా గెలుపు

image

మహంకాళి దేవాలయం డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న బైరం స్వప్న, ఇప్పుడు రామాయంపేట కౌన్సిలర్‌గా తన ముద్ర వేశారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలోనే ఆమెను దేవాలయ డైరెక్టర్‌గా ఎమ్మెల్యే రోహిత్ నియమించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ఇప్పుడు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్వప్న ధీమా వ్యక్తం చేశారు.