News September 4, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సామర్లకోట టీచర్లు

image

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సామర్లకోట మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య బుధవారం తెలిపారు. వేట్లపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కోరా బలరాంబాబు చౌదరి, కాపవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అద్దంకి వెంకన్నబాబు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు చెప్పారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా పురస్కారం అందిస్తామని విద్యాశాఖ అధికారి పుల్లయ్య వెల్లడించారు.

Similar News

News September 15, 2024

దేవీపట్నం: అనారోగ్యంతో పాఠశాల హెచ్ఎం మృతి

image

దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఎంపీపీ యూపీ పాఠశాల హెడ్ మాస్టర్ కొమరం ధర్మన్న దొర (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. కిడ్నీ, షుగర్ వ్యాధులతో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. స్వగ్రామం పాముగండి గ్రామానికి చెందిన ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 15, 2024

దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి

image

దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.

News September 15, 2024

ఉప్పాడ సముద్రంలో అద్భుత దృశ్యం (PHOTO)

image

పిఠాపురం మండల పరిధిలోని ఉప్పాడ సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతంలో శనివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎరుపు రంగులో ఉన్న వరద నీరు భారీగా సముద్రంలో కలుస్తున్న వేళ ఒకవైపు నీలివర్ణం, మరోవైపు ఎరుపు వర్ణంతో కూడిన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నా చెల్లెళ్ల గట్టుగా పిలిచే ఈ ప్రాంతంలో వరద నీరు వస్తున్నన్నీ రోజులు ఇదే విధంగా ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.