News December 15, 2025
జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.
Similar News
News February 6, 2026
సంతనూతలపాడు వద్ద గంటలు తరబడి ట్రాఫిక్

సంతనూతలపాడులో ఎండ్లూరు డొంక వద్ద రహదారిపై ఉన్న కల్వర్టు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా సంతనూతలపాడు నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై నుంచి భారీ వాహనం భారీ లోడుతో కల్వర్టుపైకి రాగానే ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
News February 6, 2026
ఉమ్మడి ప్రకాశం: 10th పరీక్షల ఫీజు గడువు పెంపు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే రెగ్యులర్/ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం తత్కాల్ పరీక్ష ఫీజు ఆలస్య రుసుముతో చెల్లించడానికి గడువు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా DEO రేణుక చెప్పారు. రూ.1,000 ఫైన్తో ఈనెల 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం గమనించాలని సూచించారు.
News February 6, 2026
ప్రకాశం జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు,మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 16. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <


