News April 8, 2025
జిల్లా పోలీస్ PGRSకు 62 అర్జీలు

కాకినాడ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి.బిందుమాధవ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో 62 మంది అర్జీదారులు నుంచి ఎస్పీ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి సత్వరమే సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదికారులకు సూచించారు.
Similar News
News November 14, 2025
ఈనెల 18న అమలాపురంలో జాబ్ మేళా

ఈనెల 18న అమలాపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయాలుకాస్లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్గా పని చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ఫ్రెషర్స్, సీనియర్స్ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల వయసు నిండినవారు అర్హులన్నారు.
News November 14, 2025
ఉండి: ‘దివ్యాంగ పిల్లలను ఆదరించాలి’

సమాజంలో ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పిల్లలను ఆదరించాలని సహిత విద్య సమన్వయకర్త టి. శ్రీనివాసరావు అన్నారు. ఉండి నియోజకవర్గం స్థాయిలో ప.గో. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు ఆయన అవగాహన కల్పించారు. MEO వినాయకుడు, భవిత కేంద్రం టీచర్ మధు, ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు.
News November 14, 2025
NZB: త్వరలో అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన: మహేష్ గౌడ్

అగ్రికల్చర్ కళాశాల త్వరలో తెలంగాణ యూనివర్సిటీలో శంకుస్థాపన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తుందన్నారు. జిల్లాలో 35 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేశామన్నారు. కరీంనగర్, బాసర రోడ్డు అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేశామన్నారు.


