News September 4, 2024
జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో సందర్శించిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని గ్రామాలను, వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, మహిళల రక్షణ, రహదారి భద్రత, నూతన చట్టాలు గురించి తెలిపారు. అదేవిధంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.
Similar News
News February 11, 2026
VZM: ‘కేంద్ర ప్రభుత్వ నిధులు మార్చిలోగా వినియోగించాలి’

కేంద్ర ప్రభుత్వ నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగంపై సమీక్షించారు. వివిధ పథకాలను అందుబాటులో ఉన్న సుమారు రూ.40 కోట్లను మార్చి 15 లోగా ఖర్చు చేయడానికి కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
VZM: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు 119 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లాలోని MRO, MPDO, మున్సిపల్ కమిషనర్లతో కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయించి నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News February 11, 2026
VZM: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 22,959 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. వీరి కోసం 119 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.


