News October 19, 2025
జిల్లా వ్యాప్తంగా 40.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 40.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అత్యధికంగా నంబులపూలకుంటలో 18.4మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా తనకల్లులో 2.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. గాండ్లపెంటలో 10 మిల్లీమీటర్లు, కదిరిలో 5.2మి.మీ, రొళ్లలో 4.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
Similar News
News October 19, 2025
మా సాయాన్ని మరిచారు: అఫ్గాన్పై షాహిద్ అఫ్రీది ఫైర్

అఫ్గాన్పై పాక్ Ex క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఫైరయ్యారు. తమ సాయాన్ని ఆ దేశం మరచిపోయినట్లుందని మండిపడ్డారు. ‘ఇలా జరుగుతుందని ఊహించలేదు. 50-60 ఏళ్లుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నేను 350 అఫ్గాన్ ఫ్యామిలీస్కు సాయం చేస్తున్నా’ అని అన్నారు. రెండూ ముస్లిం దేశాలు కాబట్టి సహకరించుకోవాలన్నారు. పాక్లో టెర్రరిజం సాగిస్తున్న వారితో అఫ్గాన్ చేతులు కలపడం విచారకరమని పరోక్షంగా భారత్పై అక్కసువెళ్లగక్కారు.
News October 19, 2025
KNR: దీపావళి.. ఈ నంబర్లు SAVE చేసుకోండి..!

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని CP గౌష్ ఆలం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సాయం కోసం వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కంట్రోల్ రూం(PCR) 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ERSS) 112 నంబర్లను సంప్రదించాలన్నారు. సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు.
News October 19, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో రేపు దీపావళి వేడుకలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో నరక చతుర్థిని పురస్కరించుకొని రేపు (ఈనెల 20న ) ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు నరకాసురవధ పురాణ కాలక్షేపం, 6 గంటలకు కల్యాణ మండపంలో ధనలక్ష్మి పూజను ఆలయ అర్చకుల వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.