News March 19, 2025
జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.
Similar News
News February 25, 2026
‘దేవాదుల’ కెపాసిటీని 100TMCలకు పెంచండి: సీఎం రేవంత్

TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం కెపాసిటీని భవిష్యత్తులో 100 TMCలకు పెంచేందుకు కసరత్తు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును 38TMCల సామర్థ్యంతో 5.57 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ₹14,359Crను ఖర్చు చేశారు. దేవాదులతో హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, భువనగిరి, ములుగు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది.
News February 25, 2026
కొత్త పెన్షన్లపై శుభవార్త

AP: కొత్త పింఛన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1న సండే కావడంతో FEB 28నే పెన్షన్లు <<19230790>>అందజేయనున్నట్లు<<>> ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76L మందికి ₹2,725Crను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు ₹4K, దివ్యాంగులకు ₹6K, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ₹10K, మంచానికే పరిమితమైన వారికి ₹15K ఇస్తున్న విషయం తెలిసిందే.
News February 25, 2026
నల్గొండ: అంగన్వాడీలపై ‘సర్పంచ్’ పెత్తనమేంటి?

అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం పెరిగి, చిన్న కారణాలతో కార్యకర్తలు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వర్గపోరు వల్ల కేంద్రాల పనితీరు దెబ్బతింటుందని, ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలోనే సేవలు సక్రమంగా అందుతున్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.


