News October 5, 2025
జీఎస్టీతో పరిశ్రమలకు లబ్ధి: కలెక్టర్

భారతదేశంలో GST సంస్కరణల అమలుతో జౌళి, విద్యుత్, చేనేత పరిశ్రమలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ 2.0పై నెల రోజులపాటు జరిగే అవగాహన సదస్సులో భాగంగా ‘సూపర్ సేవింగ్స్’ అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
Similar News
News October 5, 2025
వరంగల్: వేధిస్తే షీ టీంకు తెలియజేయండి!

మహిళలు, విద్యార్థినులను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్ సిబ్బందికి షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్పై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని సూచించారు.
News October 5, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం

TG: హైదరాబాద్లో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వచ్చే 2-3 గంటల్లో భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News October 5, 2025
సంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం నిలిపివేత: కలెక్టర్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజావాణి యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు.