News March 28, 2025
జీకేవీధిలో జ్వరంతో యువకుడు మృతి

జీకేవీధిలోని అగ్రహారంలో జ్వరంలో గురువారం శివకుమార్ (26) మృతి చెందాడు. గ్రామంలో గత కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయని మరో పది బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా మృతుడు నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా.. ప్రైవేటు వైద్యుని వద్దచికిత్స తీసుకున్నాడు. పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. వారి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Similar News
News March 31, 2025
చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్లోని టాయిలెట్లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.
News March 31, 2025
ఏప్రిల్ 2న ఏం జరగనుంది?

అగ్రరాజ్య అధినేత ట్రంప్ APR 2న తీసుకోనున్న ఓ నిర్ణయంపై భారత్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. IND నుంచి USకు ఎగుమతి అవుతున్న మందులపై 25% టారిఫ్ విధిస్తామని, దానిపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. మనం ఏటా 30బి.డాలర్ల మందులు విక్రయిస్తుండగా, 3వ వంతు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం మన ఎగుమతులపై అమెరికాలో పెద్దగా సుంకాల భారం లేనప్పటికీ భారత్ US నుంచి వస్తున్న వాటిపై 10% సుంకం వసూలు చేస్తోంది.
News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.