News February 26, 2025
జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఏపీ సీఎం చంద్రబాబు మార్చి 1న జీడీ నెల్లూరులో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ వాసంతి తెలిపారు. సీఎం కాన్వాయ్, హెలిపాడ్, పెన్షన్ల పంపిణీ స్థలం వద్ద భద్రతను పరిశీలించామన్నారు.
Similar News
News February 21, 2026
చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.
News February 21, 2026
చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News February 20, 2026
చిత్తూరు జిల్లాలో వాహనాల తనిఖీలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెప్పారు.


