News July 3, 2024

జీతాల కోసం ఏయూ ఉద్యోగుల ఎదురుచూపులు..!

image

జీతాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఉద్యోగులకు ఖాతాల్లో ఇంకా జీతాలు పడలేదు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.36 కోట్లు వరకు ఖర్చవుతుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై స్వయంగా వీసీ సంతకం పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఏయూ వీసీ తన పదవికి రాజీనామా చేయగా, కొత్తవారిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌తో పాలన సాగుతోంది.

Similar News

News July 5, 2024

క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోండి: క్రీడాభివృద్ది అధికారి

image

పాడేరు: కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని అల్లూరి జిల్లా క్రీడాభివృద్ది అధికారి జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ దరఖాస్తులకు అర్హులన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆగష్టు 1వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని, విజయవాడలోని క్రీడా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 5, 2024

విశాఖలో సందర్శనకు ‘కల్కి’ బుజ్జి

image

కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని విశాఖలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. శుక్రవారం విశాఖ వ్యాలీ స్కూల్ ప్రాంగణంలో దీన్ని ఉంచారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వాహనం వద్ద నిలుచుని ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కల్కి సినిమాలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు సందర్శనకు వీలుగా ఉంచుతున్నారు.

News July 5, 2024

విశాఖ: సచివాలయ సేవల్లో జాప్యం..?

image

గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.