News June 9, 2024
జీలుగుమిల్లి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మండలంలోని ధర్భగూడెం గ్రామంలో వీర భద్రస్వామి అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ మృతుని వివరాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు.
Similar News
News September 29, 2024
సెప్టెంబర్ 30న ఉమ్మడి ప.గో. విద్యార్థులకు పోటీలు
ఉమ్మడి ప.గో. జిల్లాలోని విద్యార్థులకు సెప్టెంబర్ 30న ‘సేవ్ ది గర్ల్’ అంశంపై వ్యాసరచన, డెబిట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ఆయా జిల్లాల శాఖ అధికారులు శనివారం తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు చేపడుతున్నామన్నారు. మొదటి విజేతకు రూ.5 వేలు, 2వ విజేతకు రూ.3 వేలు, 3వ విజేతకు 2 వేలను బహుకరిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 1న భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలు ఉంటాయన్నారు.
News September 28, 2024
ఏలూరు: వైసీపీ మాజీ MLAపై కేసు నమోదు
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అవుటుపల్లి నాగమణి అనే మహిళ కోర్టులో ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఆళ్ల నాని అతని అనుచరులపై కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 28, 2024
పాలకొల్లులో మంత్రి నారాయణ రేపటి పర్యటన ఇలా..
మంత్రి నారాయణ ఆదివారం పాలకొల్లులో పర్యటించనున్నారనిి అధికారులు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ను పరిశీలిస్తారన్నారు. 10:40కి అబ్దుల్ కలాం పార్క్, 10:50 గంటలకు సీబీఎన్ ఉద్యానవనం, 11 గంటలకు ఎన్టీఆర్ కళాక్షేత్రం, 11:10 గంటలకు అన్న క్యాంటీన్, 12:50 గంటలకు టిడ్కో ఇళ్ల వద్ద ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. 2:30 గంటలకు మున్సిపల్ ఆఫీసులో రివ్యూ నిర్వహిస్తారన్నారు.