News April 9, 2025
జీవన్ రెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ విప్

పెగడపల్లి మండలం బతికేపెల్లిలో మాజీ MLC జీవన్ రెడ్డి మా కాలగిరి ముత్యం రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముత్యం రెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జీవన్ రెడ్డిని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
Similar News
News December 17, 2025
ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జేసీ

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News December 17, 2025
పాలకవీడులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పాలకవీడు మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగిందన్నరారు. జిల్లాలో 124 సర్పంచ్, 1061 వార్డు సభ్యుల ఎన్నికలు 176 పోలింగ్ స్టేషన్లలో నిర్వహించారన్నారు.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.


