News March 21, 2025

జీవీఎంసీలో మారనున్న పార్టీల బలాబలాలు

image

జీవీఎంసీలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. 97 వార్డుల్లో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌గా హరి వెంకట కుమారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జీవీఎంసీపై ప్రభావం పడింది. 9 మంది కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. ఒక కార్పొరేటర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కూటమి బలం పుంజుకుంది. కాగా అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి వచ్చింది.

Similar News

News March 28, 2025

విశాఖలో నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు 

image

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. కీలకమైన అధ్యక్ష పదవికి ఎం.కె. శ్రీనివాస్, అహమ్మద్, సన్నీ యాదవ్ తలపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవికి చింతపల్లి ఆనంద్ కుమార్, కె.విజయ్ బాబు బరిలో ఉన్నారు. జనరల్ సెక్రటరీ పదవికి రాపేటి సూర్యనారాయణ, పార్వతి నాయుడు, సుధాకర్ తదితరులు పోటీలో ఉండగా.. కోశాధికారి పదవికి నరేశ్, రాము, శివప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఈరోజు రాత్రికి వెలువడే అవకాశం ఉంది.

News March 28, 2025

విశాఖలో ఈనెల 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

image

విశాఖలో మార్చి 30న జరిగే IPL మ్యాచ్‌ల నిర్వహణపై సీపీ శంఖబ్రత బాగ్చీ గురువారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. మ్యాచ్‌ రోజు శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస, మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్లాలని సూచించారు.

News March 27, 2025

నిత్యవసర వస్తువుల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై దృష్టి సారించాలి: జేసీ

image

మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల‌ను జేసీ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా ధ‌ర‌ల నియంత్ర‌ణ క‌మిటీతో స‌మావేశం అయ్యారు. ప్ర‌స్తుతం పప్పులు, బియ్యం ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌న్నారు. రైతు బ‌జార్లు, బ‌య‌ట మార్కెట్ల‌లో ధ‌ర‌ల‌ను ప‌రిశీలించాల‌న్నారు. మార్కెట్లో ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!