News August 22, 2025

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు

image

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 32 ఎజెండా అంశాలు, 7 టేబుల్ అంశాలకు ఆమోదం లభించింది. ముందుగా రామంతాపూర్ కృష్ణాష్టమి విషాదంలో బాధితులకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వెండింగ్ షాపుల టెండర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎల్ఈడీ లైట్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఈ నిర్ణయాలతో నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News August 22, 2025

సిటీలో త్వరలో 500 మంది ట్రాఫిక్ మార్షల్స్

image

నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేసిన సీపీ సీవీ ఆనంద్.. త్వరలో వీరి సంఖ్యను 500కు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద పలు కంపెనీలు వీరికి వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. మహావీర్ ఎస్టేట్స్, అపోలో, యశోద ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, నిలోఫర్ తదితర సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం.

News August 22, 2025

HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

image

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.

News August 22, 2025

HYD: గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా? ఇవి కంపల్సరీ

image

గణపతి నవరాత్రుల్లో మండపాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలి. https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్‌‌కు అప్లై చేయండి.
☞ విద్యుత్ కనెక్షన్‌కు డీడీ తీసుకోవాలి
☞ స్వతంత్రంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వొద్దు
☞ నిపుణులతో గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోండి
☞ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి
☞ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమచారం ఇవ్వండి.