News April 10, 2024

జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు

image

TG: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను జూన్ నెలాఖరు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,923 కేంద్రాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. ఒక్క మే నెలలోనే 57% పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 23, 2026

ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

image

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.

News February 23, 2026

IDFC ఫస్ట్ బ్యాంక్‌లో ₹590 కోట్ల స్కామ్!

image

చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో ₹590 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది. హరియాణా ప్రభుత్వ విభాగాలకు చెందిన అకౌంట్లలో ఈ గోల్‌మాల్ జరిగింది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్‌లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హరియాణా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని, సాధారణ కస్టమర్ల సొమ్ము సేఫ్ అని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది.

News February 23, 2026

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే WW-3ని ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. పుతిన్‌ను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు సైనిక, ఆర్థిక ఒత్తిడిని పెంచాలని BBCతో అన్నారు. రష్యా డిమాండ్ చేస్తున్నట్లుగా ఉక్రెయిన్ భూభాగాలను వదులుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు భూభాగాన్ని వదులుకున్నా పుతిన్ మళ్లీ దాడికి దిగుతారని ఆందోళన వ్యక్తం చేశారు.