News September 9, 2025
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక.. ఈనెల 17 వరకు అవకాశం

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ యువతకు కీలక సూచనలు చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈనెల 17 వరకు అవకాశం ఉందని కర్ణన్ తెలిపారు. ఈ సంవత్సరం జులై 1కి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువత కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.
Similar News
News September 9, 2025
మునిపల్లి: పాఠశాల స్థలాన్ని పరిశీలించిన మంత్రి

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు హాస్టల్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన ఘటన ప్రదేశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహా పరిశీలించారు. ఘటనపై అధికారులతో మంత్రి చర్చించారు. హాస్టల్లోని మిగిలిన భవనాల స్టాండర్డ్స్ను పరిశీలించి ఉపయోగానికి, పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
News September 9, 2025
కొత్తగూడ: విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్

రాష్ట్రంలోని 23 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులతో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించడానికి కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాల వేదిక కానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించడానికి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ సీతామహాలక్ష్మి, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాలు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు.
News September 9, 2025
ప్చ్.. ఓటేయడం రాని నేతలను ఎన్నుకున్నాం!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 మంది MPల <<17659975>>ఓట్లు<<>> చెల్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకే ఓటు వేయరాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకొని ఏం లాభమని అంటున్నారు. ఈ 15 ఓట్లతో ఫలితం మారకున్నా మెజార్టీపై ప్రభావం పడేది. గతంలో TGలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భారీగా గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్?