News October 21, 2025
జూబ్లీహిల్స్లో పోటెత్తిన నామినేషన్లు..!

HYDజూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా క్యూలో 100కు పైగా నామినేషన్ల సెట్లు ఉన్నాయి. ఈరోజు సా.6.30 వరకు మొత్తం 80 దాఖలయ్యాయి. సా.3లోపు ఆర్వో ఆఫీస్ లోపలికి వెళ్లిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ఈరోజు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.
Similar News
News October 22, 2025
VZM: పండగ పేరిట పన్ను దోపిడీ?

విజయనగరం జిల్లాలో రెగ్యులర్ టాక్స్ పేయర్స్ అయిన పలువురు బాణసంచా వ్యాపారులు రికార్డుల్లో రూ.కోటి రిటర్న్ మాత్రమే చూపించి, రూ.4 కోట్ల టర్నోవర్ను దాచిపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. లావాదేవీలు, అండర్-ఇన్వాయిసింగ్ ద్వారా GST స్వాహా చేస్తున్నారన్నారు. గోదాముల్లోని క్లోజింగ్ స్టాక్లో లక్షల విలువైన సరుకు లెక్కల్లో చూపడం లేదని, బోగస్ ITC క్లెయిమ్లు, E-Way బిల్ ఎగవేతలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
News October 22, 2025
అన్నమయ్య: భారీ వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08561- 293006కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
News October 22, 2025
SRD: అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన శివాలి

రుద్రారం గీతం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శనను నిర్వహించి, తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవతో కలిసి రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. ఈ విజయంతో ఆమె మొత్తం 21 గిన్నిస్ రికార్డులను సాధించి, భారతదేశంలో అత్యధిక గిన్నిస్ రికార్డులు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.