News October 7, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఉండవల్లి నివాసంలో తెలంగాణ TDP కీలక నేతలతో సమావేశం అవుతున్నట్లు TDP వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు TDP ఎలాంటి వ్యూహం రచిస్తోందోననే ఆసక్తి నెలకొంది.
Similar News
News October 7, 2025
ధర్మపురి: చికిత్స పొందుతూ మహిళ మృతి

JGTL(D) ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బగ్గి లక్ష్మి(50)రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 5న నక్కలపేటలో రోడ్డుపై నడుస్తుండగా బుగ్గారం గ్రామానికి చెందిన రాజశేఖర్ అతివేగంగా కారు నడుపుతూ లక్ష్మిని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను JGTL ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ఉదయ్కుమార్ తెలిపారు.
News October 7, 2025
పోషకాల పశువుల మేత ‘అవిశ’

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News October 7, 2025
HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.