News November 4, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్రావు మీటింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్నగర్ డివిజన్పై వ్యూహరచన కోసం హరీశ్రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో నేతలు, ఇన్ఛార్జ్లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్లలో మరింత బలోపేతం, బూత్ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.
Similar News
News November 4, 2025
జాలర్ల విడుదలకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు: కలెక్టర్

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన 9 మంది జాలర్లు బంగ్లాదేశ్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి అప్పన్న ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఎంబసీతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, జాలర్ల విడుదల కోసం ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
News November 4, 2025
SU B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. 1వ, 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ పరీక్షలు NOV 13 తేదీ నుంచి DEC 4వ తేదీ వరకు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.
News November 4, 2025
పుంగనూరులో విషాదం

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.


