News October 27, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎంపీ గోపూజ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం యూసుఫ్‌గూడలో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఓ నివాసంలో దూడ కనపడే సరికి వారు దానికి పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Similar News

News October 28, 2025

GWL: భూ సమస్యల దరఖాస్తులు పరిష్కరించాలి

image

భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి మందిరంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలుతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో గద్వాల జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందన్నారు. మిగిలిన దరఖాస్తులు వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. తహశీల్దార్లు పాల్గొన్నారు.

News October 28, 2025

లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

image

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్‌ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.

News October 28, 2025

శ్రీకాకుళం టుడే టాప్ హెడ్ లైన్స్ ఇవే

image

➫శ్రీకాకుళం జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం
➫తుఫాన్ పై అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
➫శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
➫మెండపేట-రాళ్లపేట రహదారి గుంతలమయం
➫శ్రీకాకుళం:చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
➫తుఫాన్ ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
➫పొందూరు, ఎల్.ఎన్ పేటలో నేలమట్టం అయిన వరి పంట