News October 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నిరుద్యోగుల సంచలన ప్రకటన

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నిరుద్యోగులు సంచలన ప్రకటన చేశారు. బైపోల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. ఈక్రమంలో జీపీఓ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్ 1,2,3,4 నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న దాదాపు 30 మంది నిరుద్యోగులు ఎన్నికల బరిలో ఉంటారన్నారు.
Similar News
News October 11, 2025
వర్మ.. HYDకు రంజీ ‘తిలకం’ దిద్దు!

రంజీ ట్రోఫీ.. దేశంలో 90 సార్లు జరిగిన క్రికెట్ సంగ్రామం. ఈ దేశవాలీ క్రికెట్లో HYD జట్టు కేవలం 2 టైటిళ్లు మాత్రమే గెలిచింది. మరో మూడుసార్లు రన్నరప్గా నిలిచింది. నాలుగు దశబ్దాలుగా రంజీ ట్రోఫీని HYD కైవసం చేసుకోలేకపోయింది. OCT 15 నుంచి 2025-26 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ వర్మ ఉండడంతో అభిమానుల్లో హోప్స్ పెరిగాయి. ఈ సీజన్లోనైనా <<17955623>>విజయ తిలకం<<>> దిద్దాలని ఫ్యాన్స్ కోరిక.
News October 11, 2025
పట్టుకుంటే రూ.పది లక్షలు: రాచమల్లు

అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు. బాటిళ్లు, లేబుళ్లు, మూతలు, క్యూఆర్ కోడ్ ఏ మాత్రం తేడా లేకుండా నకిలీ తీసుకువచ్చారన్నారు.
News October 11, 2025
నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు

AP: CM CBN సతీమణి, NTR ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కి ఎంపికయ్యారు. అపార వ్యాపార నాయకత్వం, వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను IOD ఈ అవార్డు ప్రకటించింది. లండన్లో నవంబర్ 4న జరిగే గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డును ఆమె స్వీకరించనున్నారు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.