News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. BJP లిస్ట్లో నందమూరి సుహాసిని పేరు..?

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. పోటీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. లంకాల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, నందమూరి సుహాసిని సహా ఏడుగురి పేర్లు షార్ట్లిస్ట్లో ఉన్నట్లు సమాచారం. ఈ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్లో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.
Similar News
News October 7, 2025
ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు: కాంగ్రెస్

బిహార్లో ఎన్ని నాన్ సిటిజెన్స్ ఓట్లను తొలగించారో వెల్లడించే ధైర్యం CECకి లేదని CONG ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘SIRలో పౌరులు కాని వ్యక్తుల పేరిట ఉన్న ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తొలగించిన ఓట్ల లెక్కల్ని దేశ ప్రజలకు తెలిసేలా బయటపెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పని మాత్రం చేయడం లేదు’ అని Xలో విమర్శించారు. కాగా బిహార్ SIRపై తమ అనాలసిస్ను జైరామ్ రమేశ్ Xలో పోస్టు చేశారు.
News October 7, 2025
HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

జూబ్లీహిల్స్ బైపోల్లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.
News October 7, 2025
పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.