News November 23, 2024

జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్

image

సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.

Similar News

News February 17, 2026

HYD: RTC బస్సుల్లో ఆధార్ కార్డు లొల్లి..!

image

ఆర్టీసీ బస్సుల్లో ఒరిజినల్ ఆధార్ కార్డు అంశంపై తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మహిళలు, కండక్టర్లు, టికెట్ ఇన్స్పెక్టర్లతో వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్టీసీ MD సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ కార్డు మాత్రమే కాదు, పాన్ కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించినా సరిపోతుందని గతంలో తెలిపారు.

News February 17, 2026

HYD: జేఈఈ మెయిన్స్‌లో Resonance ప్రభంజనం!

image

JEE మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో హైదరాబాద్‌ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్‌కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News February 17, 2026

HYD: ఈ అలవాట్లతో ప్రాణానికి ముప్పు!

image

మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం, ఉప్పు-చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. విపరీతమైన స్క్రీన్ టైమ్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీ రాళ్లకు దారితీస్తోందని సూచించారు. కాలుష్యం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారాయన్నారు.