News October 15, 2025
జూబ్లీ బైపోల్: పట్టున్నా.. పోరులో లేదాయే..!

జూబ్లీహిల్స్ బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లుండగా వీరిలో 96వేల మంది మైనారిటీ ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ ఎటువైపు పడితే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడనడంలో డౌట్ లేదు. అందుకే ఈ ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. MIMకు పట్టు ఉన్నా పోటీచేయకపోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంతర్గతంగా కాంగ్రెస్కి ఆ పార్టీ మద్దతిస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 15, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడి సిబ్బందికి వాకీటాకీలు

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు సమాచారం అందించుకోవడానికి ఇబ్బందులెదురయ్యేవి. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేయవచ్చు. దీంతో భక్తుల ఇక్కట్లకు ఫుల్స్టాప్ పడనుంది.
News October 15, 2025
మేడ్చల్, రంగారెడ్డిని సపరేట్ చేసేదే మూసీ

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ఉద్భవించిన మూసీ ప్రతాపసింగారం గుండా పరుగులు పెడుతోంది. ఇక్కడి భౌగోళిక ప్రత్యేకతలో ఈ నది విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. తూర్పు, దక్షిణం దిశలుగా ముచుకుందా(మూసీ) ప్రవహిస్తోంది. సుమారు 4.5 కి.మీ. పొడవున తీరరేఖను ఏర్పరుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దుగా ఈ నది ఉంది. నల్లగొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తోంది.
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.